మారుతి కథ ఫైనల్ చేసిన మెగాస్టార్!!
on May 29, 2019
మొదట్లో సాయి ధరమ్ తేజ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ చూసిన వాళ్లందరూ అచ్చు మెగాస్టార్ లా చేస్తున్నాడంటూ సినీ జనాలు, ప్రేక్షుకులు చెప్పుకొచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది గానీ మధ్యలో తేజ్ నటించిన వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో కొంత నిరాశ చెందాడు. ఇక ఇటీవల `చిత్రలహరి` సినిమాతో సక్సెస్ ట్రాక్ లో కి వచ్చాడు. చిత్రలహరి సినిమా చేసే ముందు ఆ కథను మెగాస్టార్ కు వినిపించాడట తేజ్. ఆ సెంట్ మెంట్ తో ఇప్పుడు చేయబోయే సినిమా కథ కూడా మారుతితో చిరంజీవికి చెప్పించాడట. మెగాస్టార్ కథలో కొన్ని మార్పులు, చేర్పులు చెప్పి కథ ఫైనల్ చేసాడట. దీంతో త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి యువి క్రియేషన్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో మాళవిక శర్మను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది.