నౌ టైం స్టార్ట్ అంటున్న మనోజ్.. మళ్ళీ ఏం చెప్పబోతున్నాడు!
on May 29, 2025
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు(Ntr)ఎవర్ గ్రీన్ హిట్స్ లో 'మేజర్ చంద్రకాంత్' ఒకటి. 1993 వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ ద్వారానే మంచు మనోజ్(Manchu Manoj)బాలనటుడిగా సిల్వర్ స్క్రీన్ పై కాలుమోపాడు. ఆ తర్వాత 2004 లో వచ్చిన 'దొంగ దొంగది' ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ్నుంచి ఎన్నో మంచి సినిమాల్లో నటిస్తు, తన అద్భుతమైన నటనతో, డైలాగ్ డెలివరీ తో ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. నేటికీ ఆయా చిత్రాల్లోని పాటలు, డైలాగ్స్, పోరాట సన్నివేశాలు చాలా మందికి గుర్తున్నాయి. తండ్రి మోహన్ బాబు నట వారసత్వాన్ని ముందుకు పర్ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్తున్నాడని అందరు భావించారు.
కానీ 2017 లో చేసిన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత మంచు మనోజ్ ఎటువంటి చిత్రంలో నటించలేదు. కెరీర్ లో ఇంత పెద్ద గ్యాప్ వస్తే అవకాశాలు దొరకడం చాలా కష్టం. కానీ అందుకు భిన్నంగా మనోజ్ ప్రస్తుతం భైరవం అనే మూవీతో పాటు 'మిరాయ్' చేస్తున్నాడు. వీటిలో భైరవం ఈ నెల ౩౦న రిలీజ్ కాబోతుంది. సుమారు పాతిక కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలో మనోజ్ క్యారక్టర్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఈ విషయం ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. దర్శకుడు కూడా ప్రమోషన్స్ లో మాట్లాడుతు మనోజ్ గారే ఆ క్యారక్టర్ కి న్యాయం చేయగలడని భావించి సెలెక్ట్ చేసుకున్నామని చెప్పాడు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మిరాయ్(Mirai)లో తేజ సజ్జ(Teja Sajja) హీరో కాగా, మనోజ్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు. నెగిటివ్ రోల్ అనే కంటే కథకి చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారక్టర్ అనుకోవచ్చు. రీసెంట్ గా రిలీజైన టీజర్ ఈ విషయాన్నే చెప్తుంది. ఈ రెండు చిత్రాల్లో మనోజ్ నటవిశ్వరూపాన్ని చూడబోతున్నామని ఆయన అభిమానులు అంటున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది. దీంతో ఎనిమిది సంవత్సరాల తర్వాత మనోజ్ టైం స్టార్ట్ అయ్యిందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
