ENGLISH | TELUGU  

నరేష్-పవిత్ర 'మళ్లీ పెళ్లి'కి ఊహించని షాక్!

on May 25, 2023

నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మళ్లీ పెళ్లి'. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా రేపు(మే 26) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు కొద్ది గంటల ముందు ఈ మూవీ టీంకి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నరేష్ మాజీ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి కోర్టుని ఆశ్రయించారు.

'మళ్లీ పెళ్లి' సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడే ఇది నరేష్-పవిత్ర ల బయోపిక్ లా ఉందనే కామెంట్స్ వినిపించాయి. నరేష్-పవిత్ర ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం, వారిద్దరూ ఓ హోటల్ లో ఉండగా రమ్య అక్కడకు వెళ్లి గొడవ చేయడం వంటి సన్నివేశాలతో పాటు టీజర్, ట్రైలర్ లో కృష్ణ, విజయనిర్మల రిఫరెన్స్ లు కూడా కనిపించాయి. ఈ సినిమా ప్రధానంగా నరేష్, పవిత్ర, రమ్య నిజజీవిత పాత్రల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని ట్రైలర్ తో దాదాపు అందరికి క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రమ్య హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా ఈ సినిమాను చిత్రీక‌రించార‌ని, కావున విడుదలను ఆపాలంటూ ఆమె పిటిషన్ వేశారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.