ఓటీటీలోనైనా మెప్పించేనా!
on Jan 28, 2022
టాలెంటెడ్ హీరో సుమంత్.. హిట్ ముఖం చూసి చాన్నాళ్ళే అయింది. అప్పుడెప్పుడో `మళ్ళీ రావా`తో చివరిసారిగా విజయం సాధించాడు సుమంత్. 2017 సంవత్సరాంతంలో వచ్చిన సదరు ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా తరువాత.. `సుబ్రమణ్యపురం` (2018), `ఇదం జగత్` (2018), `కపటధారి` (2021) వంటి చిత్రాల్లో హీరోగానూ.. `ఎన్టీఆర్` బయోపిక్ (2019)లో సహాయక పాత్రలోనూ కనిపించాడు సుమంత్. అయితే, ఈ సినిమాలేవీ తనకు సక్సెస్ ని అందించలేకపోయాయి.
ఈ నేపథ్యంలో.. `మళ్ళీ మొదలైంది` అంటూ ఓ ఆసక్తికరమైన చిత్రంతో జనం ముందుకు రాబోతున్నాడు సుమంత్. విడాకుల తరువాత జీవితం ఎలా ఉంటుందనే పాయింట్ తో రూపొందిన ఈ వినోదాత్మక చిత్రాన్ని టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేశారు. ప్రచార చిత్రాలతో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా.. థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో నేరుగా స్ట్రీమ్ కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఫిబ్రవరి 11 నుంచి `మళ్ళీ మొదలైంది` సందడి చేయనుంది. మరి.. ఇటీవల కాలంలో థియేటర్స్ లో హిట్ కొట్టలేకపోయిన సుమంత్.. ఓటీటీలోనైనా ఎంటర్టైన్ చేస్తాడేమో చూడాలి.
Also Read