బ్లాక్లో టిక్కెట్ కొన్న మహేష్ బాబు
on Aug 31, 2014
నిన్న సాయంత్రం శిల్పకళావేదికలో ‘ఆగడు’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. దర్శకుడు శంకర్ ఆడియో సీడీని విడుదల చేసి శ్రీనువైట్ల, మహేష్కు అందజేశారు. ఈ సందర్బంగా మహేష్ బాబు మాట్లాడుతూ..నేను శంకర్ అభిమానిని. చెన్నయ్లో వున్నప్పుడు శంకర్ సినిమా విడుదలైన తొలి రోజే బ్లాక్లో టిక్కెట్ కొని చూసే వాడిని. ఆయన ఈ రోజు నా సినిమా ఆడియోకు రావడం ఆనందంగా వుంది అన్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించడం ఎంజాయ్ చేస్తాను. దూకుడు తరహాలోనే ఆగడు కూడా నా కెరీర్లో మరో టర్నింగ్ పాయింట్గా నిలుస్తుంది. సెప్టెంబరు 19న చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.