హైదరాబాద్కి మహేష్ మైనపు బొమ్మ
on Feb 6, 2019
మహేష్ బాబు అభిమానులకు ఓ శుభవార్త. సింగపూర్ వరకూ వెళ్లి మహేష్ మైనపు బొమ్మను నేరుగా చూడలేమని, ఫొటో దిగలేమని చింతించేవారికి ఓ మంచి అవకాశం త్వరలో రాబోతోంది. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించనున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రతిష్టించడానికి ముందు ఒక్క రోజు హైదరాబాద్కి ఆ మైనపు బొమ్మను తీసుకు రానున్నారు. ఇక్కడ అభిమానులు, ప్రేక్షకులు దాన్ని చూడొచ్చు. దాంతో ఫొటోలూ దిగొచ్చు. వాళ్లకు మహేష్ బాబు ఏ రోజు డేట్ ఇస్తే.. ఆ రోజు ఇక్కడికి వచ్చి ఆ మైనపు బొమ్మను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్, గచ్చిబౌలిలో మహేష్ బాబు కొత్తగా ప్రారంభించిన స్వంత మల్టీప్లెక్స్ ఎఎంబి సినిమాస్ లో ఒక్క రోజు అభిమానులు దర్శనార్థం ఆ మైనపు బొమ్మ ఉంటుంది. సినిమాల విషయానికి వస్తే... మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' సినిమా తాజా షెడ్యూల్ ఈ వారమే హైదరాబాద్ లో మొదలు కానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే.