న్యూ ఇయర్ లో `మహర్షి` నెక్ట్స్ షెడ్యూల్!!
on Dec 26, 2018
`భరత్ అనే నేను` చిత్రంతో 2018లో మంచి సక్సెస్ అందుకున్నాడు మహేష్. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో `మహర్షి` సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ ఆర్ ఎఫ్సిలో మంగళవారంతో పూర్తి చేసుకుంది. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ ను జనవరిలో జరుపుకోనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాలో అమెరికాకు చెందిన ఓ పెద్ద కంపెనీ సీఈవోగా , వరల్డ్ లోనే టాప్ ఫైవ్ మిలియనీర్స్ లో ఒకడిగా నటిస్తున్నాడని ఫిలిం నగర్ లో వార్తలు వెలువడుతున్నాయి. అంటే మహేష్... శ్రీమంతుడు సినిమా తర్వాత మరోసారి అతి ధనవంతుడుగా కనపడబోతున్నాడన్నమాట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివీపీ సినిమా, వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని సయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.