మహేశ్ కి విలన్ గా మాధవన్?
on Apr 17, 2021
`సఖి`, `చెలి` వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరువైన తమిళ కథానాయకుడు మాధవన్. `ఓం శాంతి`తో ఇక్కడివారిని నేరుగా పలకరించిన మాధవన్.. ఆపై `సవ్యసాచి`, `నిశ్శబ్దం` సినిమాల్లో ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నాడు. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్టర్.. సూపర్ స్టార్ సినిమాలో మరోసారి విలన్ గా దర్శనమివ్వనున్నట్లు ఫిల్మ్ నగర్ ఇన్ఫర్మేషన్.
ఆ వివరాల్లోకి వెళితే.. మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` పేరుతో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం తొలుత కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు హ్యాండ్సమ్ స్టార్ అరవింద్ స్వామి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇప్పుడా పాత్రలో మాధవన్ కనిపించబోతున్నాడట. త్వరలోనే `సర్కారు వారి పాట`లో మాధవన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. `సవ్యసాచి`, `నిశ్శబ్దం`తో విలన్ గా విజయాలు అందుకోలేకపోయిన మాధవన్.. `సర్కారు వారి పాట`తోనైనా సక్సెస్ చూస్తాడేమో చూడాలి.
కాగా, `సర్కారు వారి పాట`లో మహేశ్ కి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
Also Read