కృతిశెట్టి ఖాతాలో మరో ప్రాజెక్ట్?
on Mar 8, 2021
లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ `ఉప్పెన`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కృతి శెట్టి. బేబమ్మ పాత్రలో మెస్మరైజ్ చేసిన ఈ కన్నడ కోమలి.. ప్రస్తుతం `శ్యామ్ సింగ రాయ్`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, #RAPO 19 వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో #RAPO 19 తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ కావడం విశేషం.
ఇదిలా ఉంటే.. కృతి తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే.. చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ కథానాయకుడిగా మురుగదాస్ శిష్యుడు రవికాంత్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా రూపొందనుంది. ఇందులో కథానాయికగా కృతి శెట్టిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
మరి.. తెలుగునాట మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన కృతి శెట్టి.. తమిళనాట కూడా అదే బాట పడుతుందేమో చూడాలి. కాగా, ధ్రువ్ ఇప్పటికే `అర్జున్ రెడ్డి` తమిళ వెర్షన్ `ఆదిత్య వర్మ`లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే విక్రమ్ తోనూ ఓ సినిమా చేయబోతున్నాడు.