ENGLISH | TELUGU  

ఓటీటీలో సంచలనం సృష్టించిన 'కార్తికేయ-2'!

on Oct 7, 2022

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ-2' మూవీ ఆగస్టు 13న థియేటర్స్ లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అక్కడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

దసరా కానుకగా అక్టోబర్ 5 నుంచి ఓటీటీ వేదిక జీ5 లో 'కార్తికేయ-2' అవుతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం 48 గంటల్లోనే 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. ఈ విషయాన్ని జీ5 ట్విట్టర్ వేదికగా పంచుకుంది.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్  మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ ఘట్టమనేని వ్యవహరించాడు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.