ఉమా మహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన తారక్
on Aug 4, 2022
దివంగత నటుడు నందమూరి తారక రామారావు కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం నాడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ నిన్న జరిగిన తన మేనత్త ఉమామహేశ్వరి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయాడు. ఈ క్రమంలో తాజాగా విదేశాల నుంచి తిరిగి వచ్చిన తారక్.. రాగానే ఉమామహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించాడు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఉమామహేశ్వరి నివాసానికి తల్లి షాలిని, భార్య లక్ష్మి ప్రణతితో కలిసి ఈరోజు తారక్ వెళ్ళాడు. వారితో తారక్ సోదరుడు, హీరో కళ్యాణ్ రామ్ కూడా ఉన్నాడు. ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారు.. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయారు.