సాహో.. వజ్రాలు స్వాహా..!!
on Aug 11, 2018
.jpg)
బాహుబలితో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తరువాతి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ప్రభాస్ ప్రస్తుతం 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.. ఈ సినిమాలో ప్రభాస్ అంతర్జాతీయ వజ్రాల దొంగ పాత్రలో కనిపించబోతున్నారట.. ఈ పాత్ర ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది.. మరోవైపు ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ.90 కోట్లు ఖర్చు చేసారని సమాచారం.. మొత్తానికి ప్రభాస్ ఓ హాలీవుడ్ రేంజ్ సినిమాను చూపించేలా ఉన్నారుగా అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



