'భీష్మ'... కుమారిని దాచేశారేంటి?
on Feb 18, 2020
'భీష్మ' ట్రైలర్ విడుదలైంది. అది చూస్తే... కామెడీ, రొమాన్స్, ఫైట్స్, పంచ్ డైలాగులకు సినిమాలో లోటు లేదని అర్థమవుతూ ఉంది. అల్రెడీ నితిన్, రష్మిక మధ్య రొమాన్స్ ను టీజర్లో చూపించారు. పాటల్లో ఇద్దరూ స్టెప్స్ బాగా వేశారు. ట్రైలర్లో 'నిన్ను నా నుండి ఎలా కాపాడుకున్నానో... ఈ కంపెనీని అలా కాపాడుకుంటా' అని రష్మిక డైలాగ్ చెప్పడం బట్టి చూస్తుంటే... సినిమాలో హీరో హీరోయిన్ బ్రేకప్ లాంటిది ఏదో ఉందని తెలుస్తోంది. అయితే... ఆ బ్రేకప్ కి కారణమైన కుమారిని మాత్రం చూపించలేదు. దాచేశారు. 'భీష్మ' సినిమాలో 'కుమారి 21ఎఫ్' ఫేమ్ హెబ్బా పటేల్ ముఖమైన పాత్రలో నటించింది. ఆమెది అతిథి పాత్ర కాదు. అలాగని, మరీ పెద్ద పాత్ర కూడా కాదు. కథను మలుపు తిప్పే పాత్ర అట. అందుకని, ట్రైలర్లో చిన్న పాత్ర చేసిన అవంతికా మిశ్రాను చూపించి హెబ్బా పటేల్ ను చూపించకుండా దాచేశారని సమాచారం. ఈ సినిమాలో బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తా విలన్ పాత్ర చేశాడు. ట్రైలర్లో అతడిని చూపించారు. నాగశౌర్య 'అశ్వథ్థామ'లో విలన్ క్యారెక్టర్ చేసింది అతడే.