ENGLISH | TELUGU  

హరీష్‌శంకర్ ఆయాసానికి కారణం ఏంటో తెలుసా?

on Jul 6, 2017


 

దువ్వాడ జగన్నాధం కలెక్షన్ల వివాదం మరో మలుపు తిరిగింది. సినిమా యూనిట్ డీజే కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని ప్రకటనలు ఇస్తే, కొందరు మాత్రం ఇవి ఫేక్ అని విమర్శిస్తున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ రోజు డీజే నైజాం కలెక్షన్స్ రిపోర్ట్ విడుదల చేసాడు. ఆయన రిపోర్ట్ ప్రకారం డీజే నైజాంలో 13 రోజుల్లో 20  కోట్ల మైలు రాయి దాటింది. గబ్బర్ సింగ్ తనకి నైజాంలో మొదటి 20 కోట్ల సినిమా కాగా, డీజే రెండవ సినిమా అని ప్రకటించారు. తనని ఎవరు ఎంత విమర్శించినా పడతానని... కానీ కలెక్షన్లు ఫేక్ అని తప్పుడు ఆర్టికల్స్ రాస్తూ, సినిమా కోసం ఎంతో కష్ట పడ్డ ఆర్టిస్టులని, సాంకేతిక నిపులని ఏదైనా అంటే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు.

సక్సెస్ ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ, ఇలా మాట్లాడక తప్పడం లేదు అని అన్నారు. అంతటితో ఆగకుండా డీజే కలెక్షన్స్ ఫేక్ అని ఎవరయినా నిరూపిస్తే తాను శాశ్వతంగా సినిమాలు చేయడం మానేస్తా అని, లేదంటే తనపై మరియు తన సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళు తమ వెబ్ సైట్ మూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అయినా ఎవరికీ లేని ఆయాసం హరీష్ శంకర్ కి ఎందుకు వస్తుంది అని కొందరు డైరెక్ట్ గానే అంటున్నారు. ఈ సినిమా హిట్ స్టేటస్ వస్తే తప్ప దిల్ రాజు ఇప్పట్లో ఇంకో అవకాశం ఇవ్వడనే భయంతో ఇదంతా చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.