ఉత్కంఠభరితంగా `ఎవరు`ట్రైలర్!!
on Aug 5, 2019
అడివి శేష్ హీరోగా `క్షణం`, గూఢచారి` చిత్రాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో తెలిసిందే. ఇక తాజాగా పివిపి బేనర్ పై `ఎవరు` చిత్రంలో అడివి శేష్, రెజీనా జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రజంట్ ఈ ట్రైలర్ వైరల్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో మరోసారి హిట్ కొట్టేలా ఉన్నాడు అడివి శేష్. `ఇక్కడ చనిపోయింది ` ఎవరు అనే ఇంట్రస్టింగ్ పాయింట్ తో సినిమాను తెరకెక్కించారు. ఇక ట్రైలర్ రెజీనాను ఎవరో లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ...ఆమె అతడి నుంచి తప్పించుకుని షూట్ చేయడం...ఓ పోలీస్ ఆఫీసర ఇన్వెస్టిగేషన్ , మరో వైపు మిస్సింగ్ కేసు ఇలా పలు ఆసక్తికరమైన ట్టిస్ట్ లతో ట్రైలర్ ని మలిచారు. ఇక ఇందులో అడవి శేష్ లంచగొండి పోలీస్ లా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే నవీన్ చంద్ర కూడా కొన్ని షాట్స్ లో కనిపించాడు. రెజీనా చుట్టూ కథ రన్ అవబోతుందని అర్థమవుతోంది. ఇక ఇంత క్రిస్పిగా, గ్రిప్పింగా ఉన్న అసలు స్టోరి వెనుకున్న రహస్యం ఏంటో తెలియాలంటే ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేయక తప్పదు.