ఫలితాల మధ్య మందేసి, చిందేసిన త్రిష
on May 17, 2014
త్రిష సినిమాల్లో చిందులేస్తే అందంగా ఉంటుంది. సినిమాలు లేనందుకేమో ఇప్పుడు మందేసి చిందులేసి నానా రగడ చేసింది. శుక్రవారం అంతా ఎన్నికల రిజల్ట్స్ కోసం ఆసక్తి గా చూస్తూ ఉంటె మధ్యలో కొన్ని టీవీ ఛానల్స్లో త్రిష ప్రత్యక్షమైంది. ఆమె ఏ ప్రాంతం నుంచో పోటి చేసి ఎన్నికల వార్తలలోకి దూసుకురాలేదు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్కు వెళ్లి మందు కొట్టి రగడ చేసిందంటూ వార్తలు ప్రసారం అయ్యాయి. ఇవి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి.
ముందు నుండి పార్టీ గర్ల్ గా త్రిషకు పేరుంది. మే 4వ తేదీన త్రిష బర్త్ డే సందర్భంగా తన ఫ్రెండ్స్ నయనతార, అమలా పాల్, రమ్య కృష్ణ, శింబుతో పాటు మరికొంత మందిని పిలిచి పార్టీ చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్స్ కు సంభందించిన ఇలాంటి వార్తలు వస్తే రేటింగ్స్ బాగా వస్తాయని తెలిసిన ఛానల్స్ వాటిని పూర్తి గా సద్వినియోగం చేసుకుంటాయి. నిన్నా అదే జరిగి ఉంటుంది. అయితే ఇలా తాగి వివాదాల్లో చిక్కుకోవడం త్రిషకు ఇదే మొదటి సారి కాదు. ఏమైనా సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన త్రిషకు ఇలాంటి తప్పులు పదే పదే చేస్తు వార్తల్లోకి రావటం ఆమె అభిమానులకు కొంత బాధ కలిగిస్తుందేమో.