ENGLISH | TELUGU  

డీజే ఆడియోని లాంచ్ చేసిన వీళ్లిద్దరూ ఎవరో తెలుసా..??

on Jun 11, 2017

హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే ఆడియోను ఇద్దరు చీఫ్ గెస్ట్‌లు ఆవిష్కరించారు. వాళ్లు ఎవరో కాదు అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్, దిల్‌రాజు మనవడు అయాంశ్. వీళ్లద్దరితో ఆడియోను లాంఛ్ చేయించాలని ముందే డిసైడ్ అయ్యారో ఏమో తెలియదు కానీ..యాంకర్ సుమ చీఫ్ గెస్ట్‌లు అ‌ని చెప్పగానే ఎవరు వస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. ఆ చిన్నారులిద్దరూ భయం..భయంగా స్టేజ్‌ మీదకు వచ్చారు..అయితే కొద్దిసేపటికే బిడియాన్ని వదిలి నవ్వూతు కనిపించారు. ముఖ్యంగా అల్లు అయాన్ తన బుజ్జి బుజ్జి చేతులతో అభిమానులకు నమస్కరించాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఆడియోను రిలీజ్ చేశారు..ఇది చూసిన వారంతా అప్పుడే మూడో తరం రెడీ అయిపోయిందే అని చర్చించుకున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.