ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మళ్ళీ కలుస్తున్న స్టార్ కపుల్!
on Oct 7, 2022
కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ తమ 18 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు కొద్ది నెలల క్రితం ప్రకటించి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ జంట తిరిగి కలవబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు కానీ అధికారికంగా ఇంకా విడాకులు తీసుకోలేదట. పైగా వీరు తమ ఇద్దరి పిల్లల కోసం మరియు కుటుంబ వేడుకల్లో అప్పుడప్పుడు కలుస్తున్నారు. ఇప్పటికీ వారు స్నేహితుల్లాగే మెలుగుతున్నారు. అయితే ఇప్పుడు విడాకుల ఆలోచనను పక్కన పెట్టి, భార్యాభర్తలుగా మళ్ళీ కలిసుండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్ తో మాట్లాడి విడాకుల ఆలోచనను పక్కన పెట్టేలా ఒప్పించినట్లు సమాచారం. రజినీతో పాటు ఇతర కుటుంబసభ్యులు కూడా పిల్లల కోసమైనా తిరిగి కలవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్పర్థలు పక్కన పెట్టి కలిసుండటానికి ధనుష్, ఐశ్వర్య సుముఖుత వ్యక్తం చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే విడిపోతున్నట్లు ప్రకటించిన కొద్ది నెలల్లోనే ధనుష్, ఐశ్వర్య మళ్ళీ కలుస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకొని ఊహించని విధంగా విడిపోయిన నాగ చైతన్య, సమంత కూడా మళ్ళీ కలిస్తే బాగుంటుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Also Read