కుబేర కి కొత్త టెన్షన్ !.. అభిమానుల్లో ఆందోళన
on Jun 10, 2025
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్నమోస్ట్ ప్రెస్టేజియస్ట్ మల్టిస్టారర్ చిత్రాల్లో నాగార్జున(Nagarjuna),ధనుష్(Dhanush)ల 'కుబేర'(Kuberaa)కూడా ఒకటి. రష్మిక(Rashmika mandanna)హీరోయిన్ కాగా 'జిమ్ సర్బ్, దలిప్ తాహిల్, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల(Sekhar Kammula)స్వీయ దర్శకత్వంలో సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు భారీ వ్యయంతో నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్(devi sri Prasad)సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇప్పటికే రిలీజైన నాగార్జున, ధనుష్, రష్మిక క్యారెక్టర్స్ కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. దీంతో కుబేర పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక కుబేర ఈ నెల 20 న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారకంగా ప్రకటించారు. అంటే రిలీజ్ కి ఇంకో పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఒక సాంగ్ పెండింగ్ ఉండటంతో పాటు రీ రికార్డింగ్ కంప్లీట్ కాలేదు. ఈ విషయాన్నీ నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడి చేసాడు. ప్రస్తుతం రీ రికార్డింగ్ అనేది సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. పైగా పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషల వాళ్ళకి నచ్చేలా చాలా జాగ్రతగా ఆర్ ఆర్ ని సమకూర్చాలి.
ఈ నేపథ్యంలో సాంగ్ తో పాటు ఆర్ ఆర్ ని దేవి కంప్లీట్ చెయ్యకపోవడంతో, నాగ్, ధనుష్ అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. చిత్ర యూనిట్ కూడా ఈ విషయంలో టెన్షన్ గా ఉన్నట్టు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ట్రైలర్ కూడా మరో మూడు రోజుల్లో రిలీజ్ కావాల్సి ఉంది. మరి అప్పటికి దేవి ఆర్ఆర్ ని కంప్లీట్ చేస్తాడేమో చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ లు ఈ మధ్య కాలంలో రీ రికార్డు లేట్ చెయ్యడంతో రిలీజ్ డేట్ వాయిదా వేయాల్సిన పరిస్థితి. కానీ కుబేర ఇప్పటికే అమెజాన్ ప్రైమ్(Amazon prime)తో ఒప్పందం చేసుకోవడం వల్ల రిలీజ్ డేట్ మార్చలేని పరిస్థితి. ఏది ఏమైనా దేవి కారణంగా లాస్ట్ మినిట్ లో 'కుబేర' టీంకి టెన్షన్ పెరిగిందని చెప్పవచ్చు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
