క్రైమ్ థ్రిల్లర్ గా 'జాన్ సే'.. బడ్జెట్ తెలిస్తే షాకే!
on Nov 21, 2022

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీ గా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. సినిమా పట్ల నిబద్దతతో ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు మరో నూతన దర్శకుడు తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు. కృతి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతోన్న 'జాన్ సే'తో ఎస్.కిరణ్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందిస్తున్నాడు.
క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కుతున్న 'జాన్ సే'లో అంకిత్, తన్వి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ స్టొరీ కూడా కీ రోల్ ప్లే చేసే ఈ చిత్రం దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరు వరకు జరిగే షెడ్యుల్ తో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. ఇందులో హీరోగా నటిస్తున్న అంకిత్ ఇంతకముందు 'జోహార్', 'తిమ్మరుసు' వంటి చిత్రాల్లో నటించగా, హీరోయిన్ తన్వి 'ఐరావతం' సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. రూ.10 కోట్ల భారీ బడ్జెట్ తో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సుమన్, అజయ్, తనికెళ్ళ భరణి, సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జాన్ సే చిత్రానికి సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



