చిన్మయి సాయం... 530+ కుటుంబాలకు!
on May 1, 2020
గాయని చిన్మయి సరికొత్త సేవకు శ్రీకారం చుట్టారు. కరోనా కాలంలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఆమె సాయం చేయడానికి ముందుకొచ్చారు. ప్రజల చేత సాయం చేయిస్తున్నారు. 'సింగింగ్ ఫర్ ఛారిటీ (లాక్ డౌన్ ముగిసే వరకూ)' అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీని కాన్సెప్ట్ ఏంటంటే... ప్రేక్షకులకు నచ్చిన పాటను లేదా పుట్టినరోజు శుభాకాంక్షలను స్వయంగా ఆలపించి పంపిస్తారు. ప్రేక్షకులు చేయవలసిందల్లా... ఎంత డొనేట్ చేయాలనుకుంటున్నారో చిన్మయికి ఈమెయిల్ చేస్తే, డబ్బులు అవసరంలో ఉన్న ఫామిలీ డీటెయిల్స్ ఇస్తారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్ షాట్ పంపిస్తే... చిన్మయి పాట పాడి పంపిస్తారు.
ఇప్పటివరకూ సుమారు 1100లమంది ప్రేక్షకులకు వీడియోస్ పంపించారు. పాటలు పాడినవి, పుట్టినరోజు, పెళ్లిరోజు శుభాంక్షలు తెలిపినవి. తద్వారా 530+ కుటుంబాలకు నేరుగా దాతలు డబ్బులు పంపించారని చిన్మయి తెలిపారు. అలాగే, నార్త్ చెన్నైలో 200+ జాలరి కుటుంబాలు, పాతికమందికి పైగా గిరిజనులకు సాయం అందిందని ఆమె వెల్లడించారు.