యూఎస్ కంటే ముందే ఇండియాలో 'బుల్లెట్ ట్రైన్'
on Jul 28, 2022

మన సినిమాలు ఇండియాలో కంటే కొద్ది గంటలు ముందుగా ఓవర్సీస్ లో విడుదలవుతుంటాయి. దానికి కాస్త భిన్నంగా ఓ హాలీవుడ్ సినిమా యూఎస్ కంటే ముందుగా ఇండియాలో విడుదలవుతోంది. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ తాజా చిత్రం 'బుల్లెట్ ట్రైన్' ఆగస్టు 4 న యూఎస్ కంటే ఒక రోజు ముందుగా భారతదేశంలో విడుదల కానుంది.
'డెడ్పూల్ 2' దర్శకుడు డేవిడ్ లీచ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ స్టార్స్ నటించారు. ఈ చిత్రంలో 'కిస్సింగ్ బూత్' నటుడు, పీపుల్స్ ఛాయిస్ అవార్డు విజేత మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డు నామినీ, జోయి కింగ్తో పాటు బహుళ ప్రైమ్టైమ్ ఎమ్మీ అవార్డు నామినీ బ్రియాన్ టైరీ హెన్రీ, 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్' ఫేమ్ ఆరోన్ టేలర్-జాన్సన్, 'ది బాయ్స్' ఫేమ్ కరెన్ ఫుకుహారా, 'ఫ్యూరీ' ఫేమ్ లోగాన్ లెర్మాన్ తదితరులు నటించారు.
2019 తర్వాత బ్రాడ్ పిట్ మొదటిసారిగా ప్రధాన పాత్రలో బిగ్ స్క్రీన్ పైకి తిరిగి వస్తుండగా... నటుడు సాండ్రా బుల్లక్ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా 'బుల్లెట్ ట్రైన్'ని దేశంలోని థియేటర్లలో ఇంగ్లీషు, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో ఆగస్టు 4న విడుదల చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



