'సన్ ఆఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' సన్నీ మూవీ!
on May 27, 2022
రైటర్ డైమండ్ రత్నబాబు 'బుర్రకథ' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పరాజయం పాలైనప్పటికీ రెండో సినిమాగా మోహన్ బాబుతో 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా రత్నబాబుకి విజయాన్ని అందించకపోగా.. ట్రోల్స్ కి గురైంది. దర్శకుడిగా మొదటి విజయం కోసం ఎదురుచూస్తున్న రత్నబాబు ఇప్పుడు బిగ్ బాస్-5 విన్నర్ సన్నీతో ఓ సినిమా చేస్తున్నాడు.
బిగ్ బాస్ తో సన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్న సన్నీ.. తాజాగా మరో సినిమాకి సిగ్నల్ ఇచ్చాడు. ఏ2బీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఈ సినిమా అధికారిక ప్రకటన ప్రక్కన మే 31న రానుంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. మే 31న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.