మూడేళ్ళకి ఒక్క సినిమా తీసేవాడు గొప్పోడా.. బెల్లంకొండ ఎవరిని టార్గెట్ చేశాడు?
on Sep 12, 2025

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన 'కిష్కింధపురి' చిత్రం తాజాగా థియేటర్లలో అడుగుపెట్టింది. డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ బుకింగ్స్ పరవాలేదు అనే స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'కిష్కింధపురి' టీం తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ ప్రెస్ మీట్ లో బెల్లంకొండ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మూడేళ్ళకి ఒక్క సినిమా తీసేవాడు గొప్పోడా? ఏడాదికి మూడు సినిమాలు తీసేవాడు గొప్పోడా? అంటూ బెల్లంకొండ సంచలన వ్యాఖ్యలు చేశాడు. (Kishkindhapuri)
ప్రెస్ మీట్ లో బెల్లంకొండ మాట్లాడుతూ.. "కిష్కింధపురికి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉంది. మూడు ప్రీమియర్ షోలు వేద్దామనుకున్నాం.. కానీ 66 షోలు పడ్డాయి. ఎక్కడికెళ్ళైనా హౌస్ ఫుల్స్. ఆర్గానిక్ గా మా సినిమా ఆడియన్స్ లోకి రీచ్ అయింది. మేము చాలా జెన్యూన్ గా, ఆర్గానిక్ గా ప్రేమను సంపాదించాం. తెలుగు ప్రేక్షకుల్లాంటి గొప్పోళ్ళు ఈ భూమ్మీద లేరు. ఎందుకంటే, వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు. మా చిన్న సినిమాని కాపాడాలని కోరుకుంటున్నాను. అసలు నిన్న మార్నింగ్ నుంచే 'కిష్కింధపురి' వచ్చి ఉండుంటే.. వేరేలా ఉండేది. లేట్ అయినా పర్లేదు.. సినిమా మంచి రేంజ్ కి వెళ్తుంది. ఇది క్రిటిక్స్ ని ఒప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు.. కానీ, ప్రేక్షకులను మెప్పించేంత గొప్ప సినిమా." అన్నాడు. (Bellamkonda Sreenivas)
అయితే, బెల్లంకొండ తన స్పీచ్ లో "జెన్యూన్ గా, ఆర్గానిక్ గా మేము ఆడియన్స్ ప్రేమను పొందాం" అని నొక్కి చెప్పడం చూస్తుంటే.. తమ సినిమాకి పోటీగా విడుదలైన 'మిరాయ్'పై పరోక్ష వ్యాఖ్యలు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే బెల్లంకొండ మరోసారి మైక్ అందుకొని.. మీడియా సపోర్ట్ బాగుందని అన్నాడు. మంచి సినిమాని ఇలాగే సపోర్ట్ చేస్తే, అందరం బాగుంటామని చెప్పాడు. అంతటితో ఆగకుండా.. "ఒక సంవత్సరానికి మూడు సినిమాలతో వచ్చే హీరో గొప్పోడా? మూడేళ్లకు ఒక సినిమాతో వచ్చేవాడు గొప్పోడా?" అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం బెల్లంకొండ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఎవరైనా హీరోని టార్గెట్ చేసి ఈ కామెంట్స్ చేశాడా? లేక కేవలం వేగంగా సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి మంచిదని చెప్పే ప్రయత్నం చేశాడా? అంటూ చర్చ జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



