'పైసా వసూల్' స్టంపర్ రివ్యూ.. రెచ్చిపోయిన బాలయ్య..
on Jul 28, 2017
బాలకృష్ణ .. పూరీ జగన్నాథ్ వంటి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న 'పైసా వసూల్' స్టంపర్ ఈ ఉదయం విడుదలైంది. అసలు వీరిద్దరూ కాంబో అంటేనే కాస్త వెరైటీగా ఉంది.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూద్దాం అని ఇంట్రస్టింగ్ గా వెయిట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఇక టీజర్ విషయానికొస్తే.. ఇందులో బాలయ్య చెప్పిన డైలాగులు చూస్తుంటే పూరీ మార్క్ క్లియర్ గా కనిపిస్తోంది. ‘అయామ్ ద హీరో, యూ ఆర్ ద విలన్ అంటూ..' దిస్ ఈజ్ యాన్ యాక్షన్ ఫిల్మ్ అని.. ‘తమ్ముడూ.. నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు.. అది నిజమో కాదో మీరే చెప్పాలి..’ అనే కాస్త వెరైటీ డైలాగ్స్ ను బాలయ్యచేత చెప్పించాడు పూరీ. బాలయ్యను మాత్రమే చూపించిన ఈ స్టంపర్ ను చూస్తుంటే.. అభిమానులను దృష్టిలో పెట్టుకొని మరీ కట్ చేసినట్టు కనిపిస్తోంది. వెరసి మొత్తానికి 'పైసా వసూల్' సినిమాతో కొత్త బాలయ్యను చూస్తామన్న సంగతి క్లియర్ గా అర్ధమైంది.
కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్ 29వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ తేదీ మారనుందనేది తాజా సమాచారం. సెప్టెంబర్ 29 కాకుండా కాస్త ముందే అంటే సెప్టెంబర్ 1న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.