'ఆదిపురుష్' టీజర్.. అంచనాలకు మించిన అద్భుతం!
on Oct 2, 2022
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఆయనను శ్రీరాముడిగా చూడాలన్న వారి కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. రామాయణ గాథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న 'ఆదిపురుష్'లో ప్రభాస్ రాముడిగా కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన మూవీ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా చిత్ర టీజర్ ని విడుదల చేసింది మూవీ టీమ్.
ఈరోజు అయోధ్యలో 'ఆదిపురుష్' మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఒక నిమిషం 46 సెకన్ల నిడివి గల టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. "భూమి కృంగినా.. నింగి చీలినా.. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వ నాశనం" అంటూ ప్రభాస్ పలికే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. శ్రీరాముడిగా ప్రభాస్ చాలా బాగున్నాడు. రాముడు నీళ్లలో తపస్సు చేస్తున్న షాట్, రామసేతుపై నడిచే షాట్ టీజర్ కే హైలైట్ గా నిలిచాయి. భారీ గ్రాఫిక్స్ తో విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి.
టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.
Also Read