ఆగస్టు 15న సుశాంత్ "అడ్డా"
on Aug 7, 2013
సుశాంత్, శాన్వి జంటగా నటించిన "అడ్డా" చిత్రం ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. శ్రీ నాగ్ కార్పోరేషన్ పతాకంపై జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించారు.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ... "అడ్డా" చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. ఈ చిత్రం సుశాంత్ కెరీర్ లో, అదే విధంగా మా బ్యానర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. అనూప్ ఈ చిత్రానికి అద్బుతమైన సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.