సైబర్ క్రైమ్ పోలీసులకు పవిత్రా లోకేశ్ ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?
on Jun 30, 2022
టాలీవుడ్ నటుడు నరేశ్తో రిలేషన్షిప్లో ఉన్నదంటూ రూమర్స్ను ఎదుర్కొంటున్న సీనియర్ నటి పవిత్రా లోకేశ్ బుధవారం మైసూరులో సైబర్క్రైమ్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. తన పేరిట సోషల్ మీడియాలో అనేక ఫేక్ అకౌంట్స్ను క్రియేట్ చేసి, వాటి ద్వారా తన పరువుకు భంగం కలిగించే పోస్టులు పెడుతున్నారని ఆ ఫిర్యాదులో ఆమె ఆరోపించారు. వాటి ద్వారా తన గురించి తప్పుడు వార్తలు, వదంతులు వ్యాపింపజేస్తున్నారని కూడా ఆమె అందులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు, విచారణ ప్రారంభించారు. కన్నడ నటుడు దివంగత మైసూరు లోకేశ్ కుమార్తె అయిన పవిత్ర.. మొదట్లో కొన్ని కన్నడ సినిమాల్లో నాయికగా నటించి, ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా ఉంటున్నారు. ఆమె భర్త సుచేంద్ర ప్రసాద్, సోదరుడు ఆది లోకేశ్ కూడా కన్నడ చిత్రసీమలో నటులుగా నిలదొక్కుకున్నవారే.
కాగా, కొంత కాలంగా టాలీవుడ్ నటుడు సీనియర్ నరేశ్తో ఆమె సహజీవనం చేస్తోందంటూ ప్రచారం నడుస్తోంది. ఆ ఇద్దరూ తరచూ పబ్లిక్ ప్లేస్లలో కలిసి కనిపిస్తుండటం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. నరేశ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మూడో భార్య రమ్య రఘుపతి, ఆయనా కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారు.
Also Read