రాజమౌళి అద్భుత సృష్టి 'బాహుబలి'కి ఏడేళ్ళు
on Jul 10, 2022

తెలుగు సినిమాకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా 'బాహుబలి'. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం మొదటి భాగం జులై 10, 2015 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. 'బాహుబలి:ద బిగినింగ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫస్ట్ పార్ట్ నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది.
'స్టూడెంట్ నెం.1' నుంచి 'ఈగ' వరకు తొమ్మిది సినిమాలు తీసి అపజయమెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎస్.ఎస్.రాజమౌళి వంద కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రభాస్ తో సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటిదాకా టాలీవుడ్ లో వంద కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సినిమానే లేదు. అలాంటిది వందల కోట్ల బడ్జెట్ తో రిస్క్ చేస్తున్నారు, కొంచెం తేడా కొట్టినా భారీ నష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఇప్పుడు సౌత్ నుంచి ఇన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయన్నా, బాలీవుడ్ సినిమాలను డామినేట్ చేసే స్థాయికి సౌత్ ఎదిగిందన్నా దానికి బహుబలినే కారణం. బాహుబలి రూపంలో బలమైన పునాది పడకపోయుంటే ఇప్పుడు ఇంతటి భారీ స్థాయి సినిమాలు వచ్చేవి కావు అనడంలో అతిశయోక్తి లేదు.
'బాహుబలి' కోసం అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. భారీ యుద్ధ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇలా ఒకరేంటి అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక కీరవాణి తన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



