రాజశేఖర్ `సింహరాశి`కి 21 ఏళ్ళు!
on Jul 6, 2022
సీనియర్ హీరో రాజశేఖర్ కి నటుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చిన చిత్రాల్లో `సింహరాశి`కి ప్రత్యేక స్థానం ఉంది. తమిళ సినిమా `మాయి` (శరత్ కుమార్, మీనా) ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు వి. సముద్ర తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. మాతృకని నిర్మించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ.. తెలుగు వెర్షన్ ని కూడా నిర్మించింది. కోట్లకు పడగెత్తినా నిరాడంబరంగా జీవించే నరసింహరాజు (రాజశేఖర్) అనే ఓ ఆదర్శవంతమైన వ్యక్తి కథే.. `సింహరాశి` చిత్రం.
ఇందులో రాజశేఖర్ కి జోడీగా సాక్షి శివానంద్ నటించగా విజయ్ కుమార్, వింధ్య, వర్ష, గిరిబాబు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అచ్యుత్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ స్వరకల్పనలో రూపొందిన పాటల్లో.. ``తెలుసా నేస్తమా``, ``అమ్మ అని పిలిచి``, ``సత్యభామ సత్యభామ``, ``రాణి రాణి``, ``పేదలంటే ప్రాణమిచ్చే`` - అంటూ మొదలయ్యే గీతాలన్నీ రంజింపజేశాయి. 2001 జూలై 6న విడుదలై ఘనవిజయం సాధించిన `సింహరాశి`.. నేటితో 21 వసంతాలను పూర్తిచేసుకుంది.
Also Read