‘వారణాసి’ విషయంలో మహేష్, రాజమౌళి ఎందుకలా చేస్తున్నారు?
on Feb 7, 2026
- నిర్మాత సేఫ్టీ కోసమే ఈ నిర్ణయమా?
- మహేష్, రాజమౌళిలకు రెమ్యునరేషన్ లేదు
- రాజమౌళి కొత్త స్ట్రాటజీ
టాలీవుడ్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా ‘వారణాసి’. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖులు సైతం ఎదురుచూస్తున్నారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్ప్పుడు వైరల్ అవుతోంది. సినిమా మేకింగ్లో, ప్రమోషన్స్లో, మార్కెటింగ్లో తనకంటూ ఒక స్టైల్ కలిగి ఉన్న రాజమౌళి.. తను చేసే సినిమాకి సంబంధించి తీసుకునే రెమ్యునరేషన్లో కూడా కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.
గతంలో కొంతమంది టాప్ హీరోలు తాము చేసే సినిమాలకు రెమ్యునరేషన్కి బదులుగా ఏదో ఒక ఏరియా థియేట్రికల్ రైట్స్ తీసుకోవడం మనం చూశాం. సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టయితే నిర్మాతకు అది భారంగా మారే అవకాశం ఉంది. దాని వల్ల సినిమా నిర్మాణం కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు హీరోలు ఈ నిర్ణయం తీసుకునేవారు. ఇప్ప్పుడు ఒక అడుగు ముందుకు వేసి రాజమౌళి కూడా అదే పద్ధతిలో వెళ్తున్నాడని తెలుస్తోంది.
భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న‘వారణాసి’ రెమ్యునరేషన్ల విషయంలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమాకి పనిచేసినందుకుగాను మహేష్, రాజమౌళి రెమ్యునరేషన్ల రూపంలో ఏమీ తీసుకోకుండా వర్క్ చేస్తున్నారట. ఇంతకుముందు రాజమౌళి చేసిన కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్తోపాటు సినిమాకి వచ్చిన లాభాల్లో కూడా వాటా తీసుకునేవారు. ఈ సినిమాకి సంబంధించి తన రెమ్యునరేషన్ కింద ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది.
డైరెక్టర్గా రాజమౌళికి మంచి గ్లోబర్ మార్కెట్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా రాజమౌళికి 160 కోట్లకుపైగా లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ ఇండియన్ డైరెక్టర్కి ఈ స్థాయి రెమ్యునరేషన్ లభించలేదు. రాజమౌళికి ఉన్న క్రేజ్, అతని సినిమాలకు వచ్చే కలెక్షన్స్ దృష్ట్యా ఆ స్థాయిలో పారితోషికం తీసుకోవడం సమంజసమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక మహేష్ విషయానికి వస్తే.. ఈ సినిమా నిర్మాణంలోనూ మహేష్ భాగస్వామి అని తెలుస్తోంది. ‘వారణాసి’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో, కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అందుకే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా అందుకునేందుకు మహేష్ కూడా సిద్ధమయ్యారని సమాచారం. తాజా అంచనాల మేరకు మహేష్కు 200 కోట్ల వరకు అందే అవకాశం కనిపిస్తోంది. ఆ విధంగా మహేష్, రాజమౌళి తమ రెమ్యునరేషన్లను ఫిక్స్ చేసుకున్నారని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



