ఆడియన్స్కి షాక్ ఇచ్చిన థియేటర్ ఓనర్స్.. జూన్ 1 నుంచి ఇక అంతే!
on May 19, 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని థియేటర్ ఓనర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ థియేటర్స్లో సినిమాలు ప్రదర్శించడం వల్ల నిర్మాతలే ఎక్కువ లాభపడుతున్నారని, తాము నష్టపోతున్నామని థియేటర్స్ యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న రెంటల్ సిస్టమ్ వల్ల థియేటర్లు రన్ చేయలేని పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. గతంలో మాదిరిగా పర్సెంటేజీ సిస్టమ్ తీసుకొస్తే థియేటర్లు బ్రతుకుతాయి అంటున్నారు. ఈ విషయంలో తమ డిమాండ్స్ నెరవేరే వరకు థియేటర్లను మూసెయ్యాలని థియేటర్స్ ఓనర్స్ భావిస్తున్నారు. జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను మూసి వేస్తున్నారు. దీంతో నిర్మాతలతోపాటు ప్రేక్షకులు కూడా ఆందోళన చెందుతున్నారు.
వచ్చే నెలలో చాలా భారీ సినిమాలు రిలీజ్లు ఉన్నాయి. ఈ సమయంలో థియేటర్ ఓనర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆయా చిత్రాల నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. పర్సెంటేజీలో టికెట్స్ని సేల్ చెయ్యడం వల్ల ఎగ్జిబిటర్స్, నిర్మాతల షేరింగ్ బాగుంటుంది అన్నది వారి అభిప్రాయం. గతంలో సినిమాలను ఈ పద్ధతిలోనే రిలీజ్ చేసేవారు. అప్పుడు థియేటర్లు బాగా రన్ అయ్యేవి. రెంటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత థియేటర్లను రన్ చేయలేక చాలా మూతపడ్డాయి. ఇక ముందు కూడా లెక్కకు మించిన థియేటర్లు క్లోజ్ చేసే పరిస్థితి ఉందని, అందుకే పర్సెంటేజీ సిస్టమ్ని అమలులోకి తీసుకు రావాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
