చిరంజీవికి పోటీగా రవితేజ..!
on Jun 5, 2025
2025 సంక్రాంతికి 'విశ్వంభర'తో చిరంజీవి, 'మాస్ జాతర'తో రవితేజ బాక్సాఫీస్ బరిలో దిగాలనుకున్నారు. కానీ, ఆ రెండు సినిమాలు ఆలస్యమయ్యాయి. 'విశ్వంభర' కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. 'మాస్ జాతర' మాత్రం ఆగస్టు 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే 2025 సంక్రాంతి మిస్ అయినప్పటికీ.. 2026 సంక్రాంతి పోరుకి చిరంజీవి, రవితేజ సై అంటున్నారు.
చిరంజీవి తన 157వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు వచ్చే పొంగల్ రేస్ లోకి రవితేజ కూడా ఎంట్రీ ఇచ్చారు.
రవితేజ తన 76వ చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నారు. ఎస్.ఎల్.వి. సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. పూజా కార్యక్రమాలతో తాజాగా మొదలైంది. అంతేకాదు, ఈ సినిమాని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
మరోవైపు, 2026 పొంగల్ కి 'అనగనగా ఒక రాజు'తో నవీన్ పోలిశెట్టి కూడా కర్చీఫ్ వేసి ఉన్నాడు. మరి వీటిలో చివరికి ఏవి పోరులో నిలుస్తాయో? నిలిచిన వాటిలో ఏవి విజయం సాధిస్తాయో? చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
