ENGLISH | TELUGU  

ఏ పనీ లేనివాళ్ళే అలా చేస్తారు.. ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ రకుల్‌!

on Jul 28, 2025

సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ అనేది సర్వసాధారణం. అతిగా ప్రవర్తించినవారిపై, తమకు నచ్చినవారిపై తరచూ ట్రోలింగ్‌ జరుగుతుంటుంది. ఈ వ్యవహారంపై హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. దేశంలోని పనీపాటా లేని వారు ఎక్కువైపోయారని, వారికి ఇది తప్ప మరో పని లేదని తన పోస్ట్‌లో ట్రోలర్స్‌ని ఉద్దేశించి కామెంట్‌ చేశారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై అనవసరమైన కామెంట్స్‌ చేస్తూ టైమ్‌ పాస్‌ చేస్తుంటారని ఘాటుగా స్పందించారు. సోషల్‌ మీడియా అనేది చాలా ఉపయోగకరమైందని, దాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఎంతో బాధాకరమన్నారు. 

తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన రకుల్‌.. ఆమధ్య జాకీ భగ్నానీని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం తమిళ్‌లో ఒక సినిమా, హిందీలో ఒక సినిమా చేస్తున్న రకుల్‌కి తెలుగులో ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. అయినా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఏదైనా డిస్కషన్‌ వచ్చినా, ట్రోలింగ్‌ జరుగుతున్నా వాటిపై తన ఒపీనియన్‌ చెప్తుంటుంది. తాజాగా సెలబ్రిటీలను ట్రోల్‌ చేస్తున్న విషయం గురించి ఘాటుగా స్పందించి మరోసారి వార్తల్లోకి వచ్చింది రకుల్‌. ఆమధ్య అవ్‌నీత్‌ కౌర్‌ పోస్టుకి విరాట్‌ కోహ్లి లైక్‌ కొట్టడంపై జరిగిన రచ్చకి సంబంధించి రకుల్‌ స్పందించింది. విరాట్‌ లైక్‌ కొట్టిన తర్వాత అవ్‌నీత్‌ ఇన్‌స్టా ఎకౌంట్‌లో 2 మిలియన్ల ఫాలోవర్స్‌ పెరిగారు. దీన్ని బట్టి మనదేశంలో సోషల్‌ మీడియాను ఫాలో అవుతూ ఎంత మంది టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటున్నారో అర్థమవుతుంది అంటూ నెటిజన్లను టార్గెట్‌ చేస్తూ కామెంట్‌ చేసింది. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.