ఇరవై రోజుల్లో రజనీకాంత్, బాలకృష్ణ చరిత్ర సృష్టిస్తారా?
on May 10, 2025
వరుస హిట్లతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్, 'పద్మభూషణ్ బాలకృష్ణ'(Balakrishna)ప్రస్తుతం 'అఖండ 2(Akhanda 2)'చేస్తున్న విషయం తెలిసిందే. విజయదశమి(Vijaya Dasami)కానుకగా సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీంతో దర్శకుడు బోయపాటి శ్రీను శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ బోయపాటి, బాలయ్య కాంబోలో సింహ, లెజండ్, అఖండ వంటి బ్లక్ బస్టర్ హిట్స్ ఉండటంతో అఖండ 2 పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక అఖండ 2 తర్వాత బాలయ్య చెయ్యబోయే సినిమాల్లో 'జైలర్ పార్ట్ 2 (Jailer 2) కూడా ఉందనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. రజనీ(Rajinikanth)తో కలిసి జైలర్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న బాలయ్య, ఈ మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని, పార్ట్ 1 లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కనపడిన తరహాలో ఆ క్యారక్టర్ ఉండబోతోందనే కథనాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జైలర్ 2 కోసం బాలయ్య ఇరవై రోజులు కాల్షీట్స్ ఇచ్చాడనే వార్త ఒక రేంజ్ లోనే వినిపిస్తుంది. దీంతో ఇరవై రోజులు కాల్షీట్స్ అంటే జైలర్ 2 లో బాలయ్యది గెస్ట్ రోల్ కాదని, సినిమా ఆసాంతం కనపడడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.
అసలు జైలర్ 2 లో బాలయ్య చేయడం లేదని, అదంతా ఒట్టి రూమర్ అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా బాలయ్య, రజనీ కాంబో సిల్వర్ స్క్రీన్ పై కనపడితే చూడాలని ఇరువురు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే జైలర్ 2 ఒక చరిత్ర సృష్టించే సినిమా అవుతుందనేది వాళ్ళ నమ్మకం. 2023 లో వచ్చిన జైలర్ రజనీని వరుస ప్లాప్ ల నుంచి బయటపడేసి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దర్శకుడు నెల్సన్ కుమార్(Nelson Dilip Kumar)కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు జైలర్ 2 స్క్రిప్ట్ రెడీ అయ్యిందని, సౌత్ కి సంబంధించిన ఒక బడా హీరో కూడా చేస్తున్నాడని వెల్లడి చేసాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
