వేదం సినిమాపై పదిహేనేళ్ల తర్వాత అల్లు అర్జున్ ట్వీట్
on Jun 4, 2025
అల్లు అర్జున్,(Allu arjun)మంచు మనోజ్(Manchu Manoj),అనుష్క(Anushka)ముఖ్య పాత్రల్లో క్రిష్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'వేదం'(Vedam). 2010 జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించగా, మంచి విజయాన్ని నమోదు చేసింది. నటుడుగా అల్లుఅర్జున్ కెరీర్ ని ఒక మలుపు తిప్పి ఒక కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసింది. నేటితో ఈ మూవీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్(X)వేదికగా వేదం షూటింగ్ అప్పటి ఫోటోలని షేర్ చేస్తూ 'వేదం నా కెరీర్ లో ఒక విభిన్నమైన చిత్రం. ఎంతో నిజాయితితో తెరకెక్కించిన క్రిష్(Krish)కి నా కృతజ్ఞతలు. అనుష్క, మంచు మనోజ్, మనోజ్ బాజ్ పేయి లాంటి నటులతో పని చెయ్యడం నాకు ఎంతో ప్రత్యేకం. సినిమాని నిర్మించిన నిర్మాతలతో పాటు సంగీతాన్ని అందించిన కీరవాణి(Keeravani)కి నా హృదయ పూర్వక అభినందనలు. ఈ సినిమాని ఆదరించి, ఎప్పటికి నిలిచిపోయే చిత్రంగా మలిచిన అభిమానులకి నా కృతజ్ఞతలని ట్వీట్ చేసాడు.
విభిన్న పద్ధతులని, జీవన శైలిని కొనసాగిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రవాదుల నుంచి ప్రజలని కాపాడుకోవడానికి తమ ప్రాణాలని తృణప్రాయంగా త్యాగం చేసే క్యారక్టర్ లలో అల్లు అర్జున్, మంచు మనోజ్ ఒదిగిపోయి నటించారు. మంచి మనసున్న, నిజాయితీతో కూడుకున్న వేశ్య క్యారక్టర్ లో అనుష్క జీవించిందని చెప్పవచ్చు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
