మరో ఐటమ్ సాంగ్ లో సమంత!
on Jun 28, 2022
'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా' అంటూ సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన 12 ఏళ్ల కెరీర్ లో సమంత మొదటిసారి స్పెషల్ సాంగ్ లో దర్శనమిచ్చింది. ఆమె చిందేస్తే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఆ సాంగ్ అన్ని చోట్లా మారుమోగిపోతోంది. ఈ ఉత్సాహంతో సమంత మరో స్పెషల్ సాంగ్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
'అర్జున్ రెడ్డి' సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ తో 'యానిమల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండగా, దానికోసం సమంతను సంప్రదించినట్లు టాక్. సమంతకు సౌత్ లో సూపర్ క్రేజ్ ఉంది. 'ది ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్ సిరీస్ తో పాటు, 'ఊ అంటావా' సాంగ్ నార్త్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందుకే పాన్ ఇండియా రేంజ్ లో రీచ్ ఉండాలంటే స్పెషల్ సాంగ్ కి సమంతను తీసుకోవడమే కరెక్ట్ అని మూవీ టీమ్ భావించిందట. సమంత సైతం 'ఊ అంటావా మావ' సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ తో.. 'యానిమల్'లో స్పెషల్ సాంగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
కాగా సమంత ప్రస్తుతం 'శాకుంతలం', 'యశోద' అనే ఫీమేల్ సెంట్రిక్ పాన్ ఇండియా సినిమాలతో పాటు.. విజయ దేవరకొండ సరసన 'ఖుషి' అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తోంది.
Also Read