అసలు సంతకమే చేయలేదట!
on Jul 12, 2016
మహేష్ బాబు-మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా పరిణీతి చోప్రాను ఎంపిక చేసుకొన్నారని, హీరోయిన్ గా ఆమెకు 3.5 కోట్ల రూపాయల పాయితోషికం సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డారని, అయితే.. ఆమె కండీషన్లు మరీ ఎక్కువగా ఉండడంతోపాటు ఖర్చుతో కూడుకొన్నవి కావడం వలన పరిణీతిచోప్రా స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ను ఎన్నుకొన్నారని నిన్నటివరకూ వార్తలు హల్ చల్ చేశాయి.
కట్ చేస్తే.. తనను మహేష్ బాబు సినిమా కోసం సంప్రదించడం తప్పితే మిగతావన్నీ అబద్ధాలు, కల్పితాలే అని కన్ఫర్మ్ చేసింది పరిణీతి చోప్రా. పరిణీతి పేల్చిన బాంబ్ కి అందరూ షాక్ అయిపోయారు. అయితే.. జనాలు షాక్ అయ్యింది పరిణీతి చెప్పిన నిజాల వల్ల కాదు.. తాము ఇప్పటివరకూ కేవలం గాసిప్పులు చదువుకుంటూ కూర్చున్నామా అని తమ పరిస్థితిపై జాలిపడ్డారు!