బాలీవుడ్ భామపై కన్నేసిన ప్రభాస్!
on May 13, 2017
బాహుబలి తర్వాత ప్రభాస్ అందనంత ఎత్తుకి ఎదిగాడు. తన తదుపరి చిత్రం గా రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ తో సాహూ అనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిలిం చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సాహూ టీజర్ ఈ మధ్యే విడుదలయి యూట్యూబ్ లో పలు రికార్డులు కొల్లగొట్టింది. యూవీ క్రియేషన్స్ వాళ్ళు ప్రతీష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ మరియు హిందీ లో ఒకేసారి నిర్మిస్తున్నారు. అయితే, ఇంత భారీ చిత్రానికి హీరోయిన్ ఛాన్స్ ఎవరికీ దక్కుతుంది అని అందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో చేస్తున్న టాప్ హీరోయిన్లు కూడా ప్రభాస్ తో నటించడానికి ఉవ్విళ్లూరుతున్నారు,
కానీ మన బాహుబలి మాత్రం బాలీవుడ్ భామపై కన్నేశాడని వార్తలు వస్తున్నాయి. తెలుగులో రెండు సినిమాలు చేసి, తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన కత్రినా కైఫ్ ని, ప్రభాస్ సినిమా సాహూ కోసం సంప్రదించారట. ఒక వేళ, అమ్మడు ఓకే చేస్తే, మళ్ళీ తెలుగు లో రీఎంట్రీ ఇవ్వనుంది. ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ బట్టి చూస్తే కత్రినా నో చెప్పే ఛాన్స్ లేదంటున్నారు. త్వరలో సెట్స్ లోకి వెళ్లనున్న సాహూ బడ్జెట్ 100 కోట్ల పైనే అంటున్నారు. ఈ సినిమా కూడా హిట్ అయితే, ఇంక ప్రభాస్ కి తిరుగుండదు.