English | Telugu

"మీరొక మంచి అబ్బాయిని నాకిచ్చారు".. ఇమ్మానియేల్ త‌ల్లితో వ‌ర్ష‌!

బుల్లితెర‌పై కొత్త జంట సంద‌డి చేస్తోంది. అదే వ‌ర్ష‌-ఇమ్మా‌నియేల్ జంట‌. ఈ టీ‌వీలో వాలెంటైన్స్‌డే సంద‌ర్భంగా 'రెండు గంట‌ల్లో ప్రేమించ‌డం ఎలా?' అనే పేరుతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో యాంక‌ర్ వ‌ర్షకు రెడ్ క‌ల‌ర్ ల‌వ్ సింబ‌ల్ వున్న బెలూన్‌ని అందించి ఇమ్మానియేల్ ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన విజువ‌ల్స్ ఇటీవ‌ల నెట్టింట సంద‌డి చేశాయి.

అదే ఎపిసోడ్‌లో ఇమ్మానియేల్ త‌ల్లిని వ‌ర్ష ఆప్యాయంగా కౌగిలించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కార్య‌క్ర‌మంలో ఇమ్మానియేల్ పేరెంట్స్‌ని స్టేజ్ పైకి ఆహ్వానించారు. త‌న త‌ల్లిదండ్రులు స్టేజ్‌పైకి రావ‌డంతో ఇమ్మానియేల్ క‌న్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి లోన‌య్యాడు. త‌న ఎదుగుద‌ల‌కు త‌న కుటుంబం ఎంతో చేసింద‌ని, అన్న‌య్య త‌న జీవితాన్ని త్యాగం చేసి త‌న‌నింత వాడిని చేశాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇమ్మానియేల్‌ని చూసిన వ‌ర్ష కూడా ఎమోష‌న‌ల్ అయ్యింది. స్టేజి మీద‌కు వ‌చ్చి అత‌ని త‌ల్లిని ఆలింగ‌నం చేసుకుంది. త‌న తండ్రి ఇటీవ‌లే చ‌నిపోయాడ‌ని, ఆ స‌మ‌యంలో ఇమ్మానియేల్ త‌న‌కు అండ‌గా నిలిచాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకుంది వ‌ర్ష‌. "మీరొక మంచి అబ్బాయిని నాకిచ్చారు." అని ఇమ్మానియేల్ త‌ల్లితో అనడంతో అంద‌రూ చ‌ప్ప‌ట్లు కొడుతూ కేక‌లు వేశారు. "ఇమ్మానియేల్ వ‌ల్ల నీకే ప్రాబ్ల‌మ్ రాదు." అని ఆమె కూడా హామీ ఇవ్వ‌డంతో వ‌ర్ష సిగ్గుల మొగ్గ అయ్యింది. ఎనిమిదేళ్ల జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇలాంటి జోక్ ఎవ‌రూ వేయ‌లేద‌ని ఆది న‌వ్వించాడు. త‌మ అమ్మానాన్న‌ల‌ది ల‌వ్ మ్యారేజ్ అని రివీల్ చేశాడు ఇమ్మానియేల్‌.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.