English | Telugu

య‌ష్, వేద‌కు ఖుషి ఆచూకీ చెప్పిన చిట్టి!

కొంత కాలంగా ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ 'ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం'. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్నారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, రాజా శ్రీ‌ధ‌ర్‌, సులోచ‌న త‌దితరులు న‌టిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుందో ఒక‌సారి చూద్దాం. ఖుషీ క‌నిపించ‌క‌పోవ‌డంతో అభిమ‌న్యుపై అనుమానం వ్య‌క్తం చేస్తాడు య‌ష్‌. వెంట‌నే వెళ్లి అభిమ‌న్యుని నిల‌దీస్తాడు.

అభిమ‌న్యు మాత్రం ఖుషీని కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేదంటాడు. అయినా స‌రే య‌ష్ వినిపించుకోకుండా అభిమ‌న్యుపై అరుస్తాడు. దీంతో మాళ‌విక మ‌ధ్య‌లోకి ఎంట‌ర‌వుతుంది. "ఖుషీ నా క‌న్న కూతురు. అలాంటిది త‌న‌ని కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఖుషీ ఎక్క‌డుందో, ఎక్క‌డికి వెళ్లిందో గంట‌లోగా నాకు చెప్ప‌క‌పోతే మీ ఇద్ద‌రిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా" అంటూ బెదిరిస్తుంది. దీంతో అక్క‌డి నుంచి య‌ష్, వేద ఇంటికి వెళ‌తారు. ఖుషీ ఎక్క‌డికి వెళ్లింద‌ని వేద బాధ‌ప‌డుతూ ఇదంతా త‌న వ‌ల్లే జ‌రిగింది అని ఫీల‌వుతుంటుంది.

నీ త‌ప్పేమీ లేద‌ని ఇదంతా త‌న‌ వ‌ల్లే జ‌రిగింద‌ని య‌ష్ వేద‌ని ఓదారుస్తుంటాడు. ఇంత‌లో పెట్ డాగ్ చిట్టి మెడ‌లో లెట‌ర్ తో ఇద్ద‌రి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. అది చూసిన య‌ష్‌, వేద ఒక్క‌సారిగా షాక్ అవుతారు. "ఖుషీ ఎక్క‌డ చిట్టీ?" అని అడుగుతారు. చిట్టీ (డాగ్‌) మెడ‌లో వున్నచీటీ తీసి ఇద్ద‌రు చ‌దువుతారు. "ఇద్ద‌రూ విడిపోతే మీకు లైఫ్ లో క‌నిపించ‌ను" అంటూ ఖుషీ అందులో రాస్తుంది. వెంట‌నే చిట్టీ స‌హాయంతో ఖుషీ వున్న చోటుకి య‌ష్, వేద వెళ‌తారు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. ఖుషీ అక్క‌డే వుందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.