English | Telugu

'ఖుష్బూ! ఢీ జోడికి మ‌నిద్ద‌రం వెళ్దామా?'.. అడిగిన బులెట్ భాస్కర్

ఎక్స్ట్రా జబర్దస్త్ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. గురు, శుక్రవారాల్లో వచ్చే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మంచి కామెడీని పంచుతూ ఉంటాయి. వీటికి మంచి టీఆర్పీ కూడా వ‌స్తోంద‌న‌డంలో సందేహం లేదు. ఈ స్టేజెస్ మీద నుంచి వెళ్లిన ఎంతోమంది కూడా ఇప్పుడు మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ షోకి గెటప్ శీను రీఎంట్రీ అద్దిరిపోయింది. ఈ ఎపిసోడ్ లో ఖుష్బూతో కలిసి బులెట్ భాస్కర్ చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రోహిణి కూడా బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్నతో కలిసి మంచి కామెడీని పండించింది. హహ హాసిని అంటూ రోహిణి బొమ్మరిల్లులో జెనీలియాలా స్కిట్ ప్లే చేసింది. సిద్ధార్థ్ క్యారెక్టర్ లో భాస్కర్ వాళ్ళ నాన్న సిద్ధుగా వ‌చ్చాడు.

"గోధుమపిండి బాగా గుద్ది గుద్ది ముద్ద చేసినట్టుగా ఉన్నావ్, నువ్ సిద్ధూవా?" అంది రోహిణి. "ఛీఛీ పోపో".. అని ఆమె అంటున్నా, భాస్కర్ వాళ్ళ నాన్న అక్కడి నుంచి కదలకుండా కొద్దిసేపు ఆమెను అలాగే చూసి, తర్వాత వెళ్ళిపోతుంటాడు. వెంటనే రోహిణి, "ఓయ్.. అంతేనా?".. అంటూ మళ్ళీ కవ్వించింది. "ఇంకేంటి .. ఇంకేం కావాలా?" అని అడిగి మంచి ఫన్ క్రియేట్ చేశాడు భాస్కర్ వాళ్ళ నాన్న.

ఈ రాబోయే ఎపిసోడ్ లో బులెట్ భాస్కర్ తెల్ల తెల్లని చీర పాటకు వర్షతో కలిసి దుమ్ము రేపే డాన్స్ చేసేశాడు. తర్వాత "రాను..రానంటూనే చిన్నదో" పాటకు ఖుష్బూ, భాస్కర్ కలిసి స్టెప్పులేశారు. పాట ఐపోయాక ఖుష్బూతో, "నెక్ట్స్‌ ఢీ జోడిలోకి మనిద్దరం వెళ్దామా, వెళ్తే అదే లాస్ట్ ఎపిసోడ్ అవుతుంది" అన్నాడు భాస్కర్. దీంతో ఖుష్బూ ఒక్కసారిగా నవ్వేసింది.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.