English | Telugu

మురారి ప్రేమని కృష్ణ దక్కించుకోగలదా.. ముకుంద ప్లాన్ ఏంటి?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -270 లో.. భర్తల దినోత్సవాన్ని కృష్ణ ప్లాన్ చేస్తుంది. అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. భర్తల దినోత్సవానికి ఏర్పాట్లు చెయ్యండని భవాని అందరికి చెప్తుంది. మరొక వైపు ముకుంద కృష్ణని చూస్తూ.. ఏంటి కృష్ణ నా పైనే ఫోకస్ పెట్టింది. నా ప్రేమ విషయం తెలిసిందా, తెలియనివ్వు. ఇక ముసుగులో గుద్దులాటలు వద్దు డైరెక్ట్ గానే తేల్చుకుందామని ముకుంద తన మనసులో అనుకుంటుంది..

ఆ తర్వాత కృష్ణ కావాలనే మురారికి తన చీర కొంగు ఇచ్చి చెయ్యి తూడ్చుకోమని చెప్తుంది. అలాగే తన కొంగుతో మురారి మొహాన్ని తుడుస్తుంది కృష్ణ. అదంతా చూస్తున్న ముకుంద కోపంతో రగిలిపోతుంది‌. ఆ తర్వాత ఎన్ని రోజులు మీ ప్రేమని దాచుకుంటారని అనుకుంటుంది. కావాలనే మురారిని కృష్ణ ఆటపట్టిస్తుంది. తన చిన్నప్పటి ఫోటో పట్టుకొని మీ బాగోతం మొత్తం తెలిసిపోయిందంటూ టెన్షన్ పెడుతుంది. అదేం ఫోటోనో అని అనుకుని మురారి కంగారుపడుతాడు. ఆ తర్వాత తన చిన్నప్పటి ఫోటో చూసి.. నన్నే అటపట్టిస్తావా అని కృష్ణ వెంబడి పరుగెట్టి ఆటపట్టిస్తాడు మురారి. ఆ తర్వాత భర్తల దినోత్సవం ఏప్రిల్ లో కదా? నువ్వు సెప్టెంబర్ అని అందరికి ఎందుకు అబద్ధం చెప్పావని కృష్ణని అడుగుతుంది భవాని‌. ముకుంద కోసం ఆదర్శ్ వచ్చేలోపు, ముకుంద అన్ని పనులు నేర్చుకుని ఆదర్శ్ ఇష్టాలు తెలుసుకొని, ఆదర్శ్ పైనే తన ధ్యాస ఉండేలా ఆదర్శే తన ప్రాణంగా ఉండేలా ముకుందని మార్చాలని అనుకుంటున్నానని భవానికి కృష్ణ చెప్తుంది. నాకు భర్తల దినోత్సవం ఇప్పుడు కాదన్న విషయం తెలిసిన నేను చెప్పలేదు.. ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వేం చేసిన మంచికే చేస్తావని నాకు తెలుసని కృష్ణతో భవాని అంటుంది.

మరొక వైపు నా ప్రేమ గురించి కృష్ణకి తెలిసిందనిపిస్తుంది. ఇక నుండి డైరెక్ట్ గానే తేల్చుకుంటానని అలేఖ్యతో ముకుంద అంటుంది. మరొక వైపు మురారికి ఇష్టమైనవేంటో అన్ని నాకు తీసుకొని వచ్చి ఇవ్వమని మధుకి కృష్ణ చెప్తుంది. దానికి మధు సరేనంటాడు. మరొక వైపు ఇంట్లో రేవతి పూజ చేసి ప్రసాదం అందరికి ఇస్తుంది. ఆ తర్వాత భర్తలకి భార్యలు తినిపించాలని ఇంట్లో అనుకుంటారు. మధుకి అలేఖ్య, ప్రసాద్ కి సుమలత తినిపిస్తారు. ఆ ప్రాసెస్ లో మధుణ అలేఖ్య ఇద్దరు ఒకరినొకరు సరదాగా అటపట్టించుకుంటారు. అప్పుడే కృష్ణ చెయ్యికి మధు తగిలి తన చేతిలోని ప్రసాదం కిందపడిపోతుంది. అలా పడిపోగానే మురారి వస్తాడు. నా దగ్గర ఉన్న ప్రసాదం మీరు తినండని కృష్ణకి ముకుంద చెప్తుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.