English | Telugu

విగ్రహాలని తీసుకొచ్చిన రాజ్.. సంతోషంలో కృష్ణమూర్తి కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -209 లో.. దొంగతనం చేసిన విగ్రహలను తీసుకొనిరావడానికి రౌడీలను వెతుక్కుంటూ రాజ్ వెళ్తాడు. మరొక వైపు అప్పు తన ఫ్రెండ్స్ తో.. రౌడీలు ఎక్కడికి వెళ్లారో వెతకండి అని చెప్తుంది.

కృష్ణమూర్తి, కనకం, కావ్య బాధపడుతుంటారు. అప్పు ఒకవైపు, రాజ్ మరొక వైపు విగ్రహలు తీసుకొని పోయిన డీసీఎమ్ వ్యాన్ లను వెతుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత రౌడీలు డీసీఎమ్ ని గండిపేట్ చెరువు దగ్గరికి తీసుకొని వెళ్తారు. అది చుసిన అప్పు ఫ్రెండ్ తనకి కాల్ చేసి చెప్పగానే.. అప్పు అక్కడికి బయలుదేరి వెళ్ళిపోతుంది.. మరొక వైపు రాజ్ కీ తన ఫ్రండ్ కాల్ చేసిన నువ్వు చెప్పినట్టు డీసీఎమ్ వ్యాన్ గండిపేట్ చెరువు దగ్గర ఉన్నాయని అనగానే.. రాజ్ అక్కడికి వెళ్ళిపోతాడు. మరొక వైపు అప్పు, తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ రౌడీల దగ్గరికి వెళ్లి వాళ్ళని కొడుతుంది. మరొక వైపు ఇలా జరిగింది ఇన్ని రోజులు చేసిన కష్టమంతా వృధా అయిందంటూ కృష్ణమూర్తి ఏడుస్తుంటే కావ్య ఓదారుస్తుంది. మరొక వైపు రాజ్ కూడా రౌడీల దగ్గరికి వెళ్లి.. వాళ్ళు కన్పిస్తే నాకు చెప్పమని చెప్పాను కదా.. ముందు ఆ స్టూడెంట్స్ ని ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పని అప్పుతో రాజ్ చెప్తాడు. ఆ తర్వాత రాజ్ రౌడీలకి బుద్ధి చెప్తాడు. ఆ తర్వాత ఆ డీసీఎమ్ లని అక్కడ నుండి కృష్ణమూర్తి వాళ్ళు ఉన్న చోటుకి తీసుకొని వెళ్తాడు.

మరొక వైపు కృష్ణమూర్తికి విగ్రహాల కాంట్రాక్ట్ ఇచ్చిన శ్రీనివాస్.. విగ్రహాలు వస్తాయో రావోనని టెన్షన్ పడుతుంటాడు. ఇంక విగ్రహలు తీసుకొని రాలేదు. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. వాళ్లకేం సమాధానం చెప్పాలంటూ శ్రీనివాస్ అంటాడు. అప్పుడే రాజ్ డీసీఎమ్ లతో వాళ్ళ దగ్గరికి రావడం చూసిన.. కృష్ణమూర్తి కావ్య టెన్షన్ తో రాజ్ దగ్గరికి వెళ్తారు. ఇక అప్పు జరిగిందంతా చెప్తుంది. ఆ తర్వాత ఇంత సహాయం చేశారంటూ రాజ్ ని హగ్ చేసుకుంటుంది కావ్య. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తి అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అక్కడ అన్నపూర్ణ ఏమైంది అని అడుగగా జరిగిందంతా చెప్తారు. మరొక వైపు స్వప్న తను ప్రెగ్నెంట్ అని నమ్మించే ప్రయత్నంతో పొట్ట ఎత్తుగా కన్పించాలని బెల్ట్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత రాహుల్ రాగానే నాలో ఏదైనా చేంజ్ కనపిస్తుందా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.