Read more!

English | Telugu

శ్రీవల్లి సీరియల్ 50 ఎపిసోడ్స్ సెలెబ్రేషన్స్

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీవల్లి సీరియల్ 50 ఎపిసోడ్స్ ఐన సందర్భంగా నటి శ్రీవల్లి భర్త విక్రమ్ తన టీం మొత్తానికి దావత్ ఇచ్చాడు. ఈ సందర్భంగా కేక్ కూడా కట్ చేశారు. ముందుగా రక్త మైసమ్మ గుళ్లో పూజలు చేసుకున్నాక ఈ సెలెబ్రేషన్స్ ని స్టార్ట్ చేశారు. హిమజ ప్రసాదం వండి తీసుకొచ్చింది. అలాగే  శ్రీవాణితో కలిసి తాను కూడా జిమ్ కి వెళ్తున్నట్లు చెప్పారు. అలాగే వాళ్ళ జిమ్ కోచ్ ని కూడా ఈ సెలెబ్రేషన్స్ కి ఇన్వైట్ చేశారు. కో-డైరెక్టర్ సతీష్ గురించి కూడా చాలా చెప్పారు విక్రమ్...కమిట్మెంట్స్ ఉన్నప్పుడు అడ్జెస్ట్మెంట్స్ చేయాలంటే సతీష్ ఒక్కరే చేయగలరని చెప్పారు. ఇక ఈ సెలెబ్రేషన్స్ కి శ్రీవాణి కూడా వచ్చింది.  

ఇంకా శతమానం భవతి సీరియల్ నటి నీలిమ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. శతమానంభవతి టీం, శ్రీవల్లీ టీం ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే  ఈ రెండు సీరియల్స్ జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళవి కాబట్టి అని చెప్పారు విక్రమ్. ఇక ఈ జ్ఞాపిక ప్రొడక్షన్స్ కి సన్నిహితురాలు, స్నేహితురాలు ఐన తన చెల్లి హిమజకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారని, తర్వాత తామే చూసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక  భోజనాలు చేసాక అందరూ కలిసి కేక్ కట్ చేసుకుని తిన్నారు. శ్రీవాణి, విక్రమ్ ని అక్కడికి వచ్చిన వాళ్లంతా విష్ చేశారు. వీళ్ళు బుల్లితెర మీద సీరియల్స్ లో అలాగే కొన్ని షోస్ లో, ఈవెంట్స్ లో నటిస్తుంటారు. ఇద్దరికి చెరొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో రెగ్యులర్ అప్ డేట్స్ పెడుతూ ఉంటారు.