English | Telugu

బుల్లితెరపైకి వెన్నెల కిషోర్!

ఎందరో హీరో హీరోయిన్లు, కమెడియన్లు బుల్లితెరపై యాంకర్లుగా మారి అలరించారు. ఇప్పుడు అదే బాటలో కమెడియన్ వెన్నెల కిషోర్ పయనించబోతున్నాడు. త్వరలో ఈటీవీలో ప్రసారం కానున్న 'అలా మొదలైంది' అనే షోకి ఆయన హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోని నిర్మిస్తుండటం విశేషం. తాజాగా ఈ షోని అధికారికంగా ప్రకటించారు. "నవ్వడానికి సిద్ధంగా ఉండండి" అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

గతంలో ఈటీవీలో కమెడియన్ అలీ హోస్ట్ గా 'ఆలీతో సరదాగా' అనే టాక్ షో ప్రసారమైంది. అందులో అలీ సెలెబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసి అలరించాడు. మరి ఇప్పుడు వెన్నెల కిషోర్ హోస్ట్ చేయనున్న 'అలా మొదలైంది' షో ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి నెలకొంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.