English | Telugu

Mid week elimination Bigg Boss 9 Telugu : మిడ్ వీక్ ఎలిమినేషన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. బిగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వీక్ ఒకరు ఎలిమినేట్ అయితే ఇంకా ఆరుగురు ఉంటారు. ఫినాలే కి టాప్-5 ఉంటారు. కాబట్టి ఈ వీక్ ఒకరు లేదా నెక్స్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఇప్పటికే ఓటింగ్ లో సంజన, సుమన్ లీస్ట్ లో ఉన్నారు. గతవారమే వీళ్లలో ఎవరో ఒకరు వెళ్ళల్సింది కానీ అనూహ్యంగా రీతూ బయటకు వచ్చింది.

ఈ వారం వీకెండ్ లో సుమన్ ఎలిమినేట్ అవ్వడం పక్క.. మిడ్ వీక్ ఎలిమినేషన్ సంజన అవుతుందని అందరు అనుకుంటున్నారు. ఈ ఎలిమినేషన్ అనేది హౌస్ మేట్స్ నిర్ణయంపై ఆధారపడుతుంది. ఇప్పటివరకు ఏ సీజన్ లో అయిన మిడ్ వీక్ ఎలిమినేషన్ లో హౌస్ మేట్స్ అందరిని పిలిచి టాప్-5 కి అర్హత లేని వారిని డిసైడ్ అయి చెప్పమంటాడు బిగ్ బాస్. అలా అందరు ఒకరి పేరు చెప్పాలి. ఇప్పటికే హౌస్ లో జీరో పాయింట్స్ తో సంజన ఉంది. హౌస్ లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే అందరికంటే లీస్ట్ సుమన్.. కానీ సంజన, సుమన్ ఇద్దరు ఉంటే అందరు సంజనని సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో తను మిడ్ వీక్ బయటకు వచ్చేస్తుంది.

టాప్-5 భరణి కన్ఫమ్. టాప్-5 లో పెట్టేందుకే భరణికి బూస్ట్ ఇచ్చి మరి రీఎంట్రీ ఇచ్చారు. అలాంటిది భరణి బయటకు వెళ్లే ఛాన్స్ లేదు. కళ్యాణ్, తనూజ,ఇమ్మాన్యుయేల్, డీమాన్, భరణి టాప్-5 కంటెస్టెంట్స్ అని అందరికి తెలిసిందే. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో సుమన్ , సంజన కాకుండా డీమాన్ గానీ భరణి గానీ బయటకు వస్తే బిగ్ బాస్ సీజన్-9 కి ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్ అవుతుంది. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.