English | Telugu

బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన 'బబ్లీ బౌన్సర్'!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ ఆదివారం ఎవరో ఒకరు సెలబ్రిటీ రావడం తెలిసిన విషయమే. అయితే ఈ వారం సెలబ్రిటీగా నటి 'తమన్నా' బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది.

"బబ్లీ బౌన్సర్ మూవీతో త్వరలో మీ ముందుకు వస్తున్నా" అని చెప్పింది తమన్నా. తర్వాత నాగార్జున కాసేపు తను నటించిన సినిమా గురించి చెప్పమన్నాడు. "క్లాస్ గా, మాస్ గా నటించడం సులభమే కానీ అమాయకంగా నటించడం చాలా కష్టం. ఈ మూవీలో నేను అమాయకంగానూ, మాస్ రోల్ 'బౌన్సర్' గాను చేసాను" అని తమన్నా నాగార్జునతో చెప్పింది. తర్వాత 'ఈ వారం తమన్నా కానుకగా ప్రకటిస్తున్నాను' అని నాగార్జున కంటెస్టెంట్స్ తో చెప్పాడు. తర్వాత హౌస్ లోకి అడుగుపెట్టింది. కంటెస్టెంట్స్ అందరూ తమన్నాను చూడగానే 'ఓ' అంటూ అరుస్తూ కేకలు వేసారు. "ఎవరైతే తమన్నాను ఇంప్రెస్ చేస్తారో వారికే ఈ వారం బహుమతి" అని నాగార్జున కంటెస్టెంట్స్ తో చెప్పాడు. రేవంత్, అర్జున్, సూర్య, రోహిత్ తమ మాటలతో ఇంప్రెస్ చేద్దామని ప్రయత్నించారు. సూర్య 'విజయదేవరకొండ' వాయిస్ ని, 'అల్లు అర్జున్' వాయిస్ ని, మిమిక్రీ చేసి తమన్నాను ఇంప్రెస్ చేసాడు. సూర్య టాస్క్ లో గెలిచి తమన్నా కానుకను గెలుచుకున్నాడు.

టైం ఐపోయిందని బిగ్ బాస్ హౌస్ నుండి తమన్నా ను బయటకు వచ్చేయమన్నాడు నాగార్జున. అలా కాసేపు బబ్లీ బౌన్సర్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.