English | Telugu

'డాన్స్ ఐకాన్ ఈజ్ రాకింగ్'.. గట్టిగా అరిచి చెప్పిన రమ్యకృష్ణ!


'డాన్స్ ఐకాన్' ఇలా మొదలయ్యిందో లేదో ఈ షోకి మంచి ప్రశంసలు అందుతున్నాయి ఆడియన్స్ నుంచి. ఎందుకంటే ఈ షోలో డాన్స్ మాత్రమే కనిపిస్తోంది. మిగతా డాన్స్ షోస్ లో ఎంటర్టైన్మెంట్ తప్ప డాన్స్ అనేది కనిపించడం లేదనే టాక్ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వినిపిస్తోంది. ఐతే ఇప్పుడు డాన్స్ ఐకాన్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో లేడీ కంటెస్టెంట్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ మెస్మరైజింగ్‌ పెర్ఫార్మెన్సులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ లేటెస్ట్ ప్రోమోలో చిన్నారి ఫ్లోరినా చేసిన డాన్స్ కి శేఖర్ మాస్టర్ మంచి కంప్లిమెంట్ ఇచ్చేసారు.. "కాంపిటీషన్ లో చేస్తున్నట్టు లేదు.. ఏదో ఇంట్లో చేస్తున్నట్టు ఉంది" అంటూ.

ఇక అల్లరి యాంకర్ శ్రీముఖి "పీఎస్ పీకే మానరిజమ్ చేసేద్దాం" అంటూ యాంకర్ ఓంకార్ చేత కూడా చేయించింది. ఇక కంటెస్టెంట్ అనుదిత పెర్ఫార్మెన్స్ కి రమ్యకృష్ణ ఫిదా ఐపోయింది. ఇక సౌమ్య పెర్ఫార్మెన్స్ కి ముగ్గురు కో - ఓనర్స్ లేచి స్టాండింగ్ ఒవేషన్ ఇస్తారు. బుట్టబొమ్మ సాంగ్ కి డాన్స్ చేసిన సౌమ్యని శేఖర్ మాస్టర్ స్టేజి మీదకి వచ్చి మరీ అభినందించారు. "ఈ బుట్టబొమ్మకు దానమ్మ, దాని అమ్మమ్మ ఎవ్వరొచ్చినా ఈమెలా చేయలేరు" అని అన్నాడు. ఇక అరుంధతి చేసిన డాన్స్ స్టేజిని హీటెక్కించింది.

దాంతో శేఖర్ మాస్టర్ ఆ వేడి భరించలేక మంచి నీళ్లు తాగేసి "అరుంధతీ.. ఇక్కడున్న వాళ్లందరినీ ఎందుకు ఇలా పరేషాన్ చేస్తున్నావ్" అనేసరికి అందరూ గట్టిగా నవ్వేశారు. ఆల్రెడీ గత ఎపిసోడ్ లో అరుంధతి పెర్ఫామెన్స్ చూసి "నువ్వు హీరోయిన్ మెటీరియల్" అని కూడా శేఖర్ మాస్టర్ కాంప్లిమెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అరుంధతి డాన్స్ కి "సూపర్ సే ఊపర్, ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్" అంటూ రమ్యకృష్ణ పొగిడేసింది. "ఒకళ్ళను మించి ఒకళ్ళు అన్నట్టుగా డాన్స్ చేస్తున్నారు. డాన్స్ ఐకాన్ ఈజ్ రాకింగ్ " అంటూ గట్టిగా అరిచి మరీ చెప్పింది రమ్య కృష్ణ.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.