English | Telugu

కన్నడ వాళ్ళు రెండు చోట్ల సంపాదిస్తుంటే....మేము అడుక్కుతినాలా..

తమన్నా సింహాద్రి శ్రీముఖితో ఎక్కువగా అవుట్ డోర్స్ కి వెళ్లే ఒక వ్యక్తిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికీ తెలుసు. శ్రీముఖితో వాళ్ళ అమ్మతో ఈమె ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో రకరకాల రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి తమన్నా సింహాద్రి తెలుగు సీరియల్స్ గురించి, బిగ్ బాస్ గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. "తెలుగు సీరియల్స్ చూడండి, తెలుగు బిగ్ బాస్ చూడండి...తెలుగు వాళ్ళు కనిపించరు..అందరూ కన్నడ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. అదే బాలీవుడ్ బిగ్ బాస్ చూడండి వాళ్ళ వాళ్ళే ఎక్కువగా ఉంటారు. నేను హిందీలో అనర్గళంగా మాట్లాడగలను, కంటెంట్ ఇవ్వగలను కానీ వాళ్ళు నన్ను తీసుకుంటారా తీసుకోరు. కానీ ఇక్కడ తెలుగు అమ్మాయిలను పక్కనపెట్టేసి కన్నడ వాళ్లనే ఎక్కువగా తీసుకుంటారు. మన వాళ్లకు ఎప్పుడూ పక్కింటి పుల్లకూర రుచిగా ఉంటుంది. నిజం ఏదైనా కానీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే నాకు అలవాటు. బిగ్ బాస్ వలన నేను చాలా బ్యాడ్ అయ్యాను. కాంట్రవర్షియల్ అయ్యాను, అలాగే పబ్లిక్ లో కూడా చాలా బ్యాడ్ అయ్యాను.

నేనేంటో చిరంజీవి గారు, శ్రీముఖి గుర్తించారు. నిజాయితీగా ఉన్నానన్న విషయాన్ని కొంతమందన్నా గుర్తించారు. అది హ్యాపీ నాకు. కన్నడ వాళ్ళు అక్కడ, ఇక్కడ సంపాదించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రములో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళం మేము అడుక్కుతినాల ? శోభా శెట్టి ఇక్కడ బిగ్ బాస్ లో కన్నడ బిగ్ బాస్ లోకి వెళ్ళింది. ఎం కంటెంట్ ఇస్తున్నారు వాళ్ళు ? ఎం పగలదీస్తున్నారు వాళ్ళు ? ఆంధ్రా ప్రజలు ఎక్కుగా నాటకాలకు, అబద్ధాలకు అట్ట్రాక్ట్ ఐపోతారు. బిగ్ బాస్ లో చేసే వాళ్లంతా రియాలిటీ కాదు అంతా నటన.. ఆ పల్లవి ప్రశాంత్ ఏంటి అతను అంతా నటనే కదా...నేను కూడా ఒక ట్రాన్స్ ఫిమేల్ ని అని చెప్పి నిద్ర లేచిన దగ్గర నుంచి దండాలు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటే టాప్ 5 లో ఉండేదాన్ని." అంటూ చెప్పుకొచ్చింది తమన్నా సింహాద్రి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.